10-04-2025 06:14:29 PM
కామారెడ్డి (విజయక్రాంతి): రైతులకు మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో గురువారం సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు భూమయ్య, నాయకులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.