calender_icon.png 28 September, 2024 | 6:52 PM

మంత్రులను కలిసిన గడ్డి అన్నారం మార్కెట్ పాలకవర్గం

27-09-2024 02:32:39 AM

ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్లు) మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి గురువారం పాలకవర్గ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులను కలిసిన వారిలో వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, డైరెక్టర్లు అంజయ్య, మేకం లక్ష్మి, మచ్చేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, గణేశ్‌నాయక్, నరసింహ, బండి మధుసూదన్‌రావు, నవరాజ్, గోవర్థన్‌రెడ్డి, వెంకట్ గుప్తా, జైపాల్ రెడ్డి, ఇబ్రహీం తదితరులు ఉన్నారు.