calender_icon.png 26 October, 2024 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంజీగోండ్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు అందజేసిన జీఎం

26-10-2024 11:13:36 AM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని వనవాసి కళ్యాణ పరిషత్ లో ఉండి విద్యను అభ్యసిస్తున్న రాంజీగోండ్ ఆవాస విద్యార్థులకు 2024-2025 సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు చెక్కును శుక్రవారం రాత్రి మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్ కమిటీ సభ్యులకు అందజేశారు. రాంజీగోండ్ ఆవాస విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ ఆసిఫ్, గౌరవ అధ్యక్షులు కొడిప్యాక విద్యాసాగర్, కార్యదర్శి కాసర్ల తిరుపతి, కోశాధికారి సూరం లక్ష్మి, ప్రముఖ్ కొమరం తిరుపతి, ప్రధాన ఆచార్యులు ఇంగు భాగ్యలక్ష్మి, పాఠశాల ఆచార్యులు పెనుగొండ మమత, కొలుగూరి సౌజన్య, సాయిరాం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వనవాసి కళ్యాణ పరిషత్ గౌరవ అధ్యక్షులు సుంకె కిష్టయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.