calender_icon.png 21 October, 2024 | 5:50 PM

రెస్క్యూ సభ్యులను అభినందించిన జిఎం

21-10-2024 04:00:21 PM

మందమర్రి (విజయక్రాంతి): రామగుండం 2 ఏరియాలోని రెస్క్యూ స్టేషన్ ఆవరణలో ఇటీవల జరిగిన జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలలో ఏరియాలోని రెస్క్యూ సభ్యులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి.దేవేందర్ అభినందించారు. సోమవారం జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 15 నుండి 17 తేదీలలో ఆర్ జి -2 ఏరియలోని రెస్క్యూ స్టేషన్ ఆవరణలో జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు నిర్వచించడం జరిగిందని ఈ పోటీలలో ఏరియాకు బెస్ట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్, బెస్ట్ సెకండ్ రెస్క్యూ రికవరి, ఓవరాల్ మూడవ బహుమతులను సాధించారని రెస్క్యూ సభ్యులను అభినందించారు.

రెస్క్యూ సభ్యులు ఇదే ఒరవడిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో సంస్థకు ఉత్తమ సేవలందించాలని కోరారు. అనంతరం రెస్క్యూ సభ్యులను ఘనంగా సన్మానించారు. దన్సార్ లో జరుగు ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీలు-2024 కి  ఏరియా బి.పి.ఎ రీజియన్ రెస్క్యూ స్టేషన్ నుండి కె.గణేష్ రామన్, సాంబ శివుడు పాల్గొననుండగా వీరికి శిక్షణ ఇచ్చిన టీం సభ్యులు రెస్క్యూ బ్రిగేడ్ మెంబర్ టి.సంపత్,శ్రీరామ్, జె.వెంకటేష్,ఎన్ మనోహర్ లను జిఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఎ.రాంమోహన్ ఇంచార్జి ఎం.ఆర్.ఎస్, డివైపిఎం మైత్రేయ భందు, టీం కెప్టెన్, కె గణేష్ రామన్, రెస్క్యూ బృందం సభ్యులు పాల్గొన్నారు.