calender_icon.png 18 October, 2024 | 3:43 PM

గంగావతరణం

18-10-2024 12:00:00 AM

సద్గురు జగ్గీ వాసుదేవ్ :

శివుని జటాజూటాల నుంచి గంగానది  జాలు వారుతుందని పౌరాణికులు అంటారు. ‘హిమాలయాలలో, అక్కడున్న ప్రతి శిఖరమూ సాక్షాత్తు ఆ శివుడే’ అని ఓ నానుడి ఉంది. హిమాలయ శిఖరాలు మంచుతో కప్పి ఉంటాయి. ఈ మంచు కొండల నుంచి పారే ఎన్నో చిన్నచిన్న వాగులన్నీ ఒకటిగా కలిసి, ఓ ప్రవాహంగా మారి, ఆపై నదులుగా మారతాయి.

అందువల్లే, వాళ్ళు ‘హిమాలయం శివు ని వంటిదనీ, కిందకు పారే ఈ వాగులను ఆయన జటాజూటాలనీ, అవే గంగానదిగా అయ్యాయని, అది నింగి నుంచి భువికి దిగి వచ్చిందనీ’ అంటారు. నింగి నుంచి రావడమన్నది నిజమే. ఎందుకంటే, మంచు ఆకాశం నుండే కురుస్తుంది కనుక.

ఇలాంటి ఉపమానాల నుంచే గంగానది కథ వచ్చింది. అలాగే, గంగ నింగి నుంచి వచ్చింది కాబట్టి, దాన్ని అత్యంత స్వచ్ఛమైన జలంగా పరిగణిస్తారు. అన్నింటికీ మించి, ఒక విధమైన ప్రదేశం గుండా ప్రవహించడం వల్ల గంగా జలానికి ఓ విధమైన గుణం వస్తుంది. 

నేను 19 ఏళ్ల వయసు నుంచీ ప్రతి సంవత్సరం ఒంటరిగా హిమాలయాలు ఎక్కేవాడిని. పెద్దగా వస్తు సామాగ్రి ఏమీ తీసుకోకుండా ఊరికే అలా వెళ్ళేవాడిని. నా దగ్గర కేవలం ఓ డెనిమ్ జీన్స్ ప్యాంటు, ఇంకా ఓ మందపాటి టీ షర్టు మాత్రమే ఉండేవి. కాబట్టి, ఎప్పుడూ చలికి వణుకుతూ, ఆకలితో ఉండేవాడిని. ఇది చాలాసార్లు జరిగింది.

అదేంటంటే, కేవలం కొన్ని దోసిళ్ళ గంగాజలం తాగినప్పుడు, అది నన్ను 48 గంటలకంటే ఎక్కువ సేపు ఎటువం టి అలసటా లేకుండా వెళ్ళగలిగేలా చేసింది. అలాగే, చాలామంది గంగాజలం తాగినప్పుడు తమ రుగ్మతలు పోయాయని స్వయంగా నాతో చెప్పారు. భారతదేశంలో ఆఖరికి ఎవర న్నా చనిపోతున్నప్పుడు కూడా కొద్దిగా గంగాజలం గొంతులో పోస్తారు. గంగాజలం గొప్ప ప్రభావం చూపిస్తుంది. ఆ జలానికి ఉండే గుణం అటువంటిది. వాస్తవానికి ఈ నీటికి ఆ గుణాన్ని ఇచ్చేది హిమాలయాలు.

నదులకు జీవం ఉంటుంది!

గంగానదిని గురించిన కథ ఏమిటంటే, దేవలోకాలలో ప్రవహించే ఈ నది మన భూమి మీదకి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ తాకిడికి ప్రపంచం నాశనమైపోయే అవకాశం ఉం ది. కాబట్టి, శివుడు ఆ ప్రవాహాన్ని తన తలపై ఒడిసి పట్టి, తన జటాజుటాల ద్వారా, హిమాలయ కొనల మీదుగా నెమ్మదిగా ప్రవహించే లా చేస్తాడు. ఈ విధంగా మాండలిక కథద్వారా ప్రజలకు గంగానది ఎంత ముఖ్యమైందో, ఎంత పవిత్రమైందో వివరించారు.

భారతీయు ని స్వచ్ఛతకు గంగానది స్వచ్ఛత ఓ ఉపమానం (సింబలిజమ్) అయ్యింది. మీరు గనక నదులవద్ద ఎక్కువ కాలం గడిపితే, ప్రతి నదికీ తన దైన సొంత జీవం ఉంటుందని మీకు అర్థమవుతుంది. ఇది ప్రపంచంలో ప్రతీ చోటా వర్తి స్తుంది. అది ఈజిప్టు నైలునది అయినా, యూ రప్ డానుబే నది అయినా, రష్యా ఇంకా మధ్య ఆసియా దేశాలగుండా ప్రవహించే ఓల్గా అయి నా, అమెరికాలోని మిస్సిసిపీ అయినా, లేదా దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది అయినా అన్నింటికీ ఇది వర్తిస్తుంది.

వాటిని కేవలం ఓ నీటి వనరులుగా మాత్రమే చూడరు. ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్కృతులూ నదుల తీరాలలోనే ఉద్భవించి అభివృద్ధి చెందాయని, అందుకు కారణమూ ఉందని మనకు స్పష్టం గా తెలుసు. కానీ, నదులతో చాలా దగ్గరగా గడిపే వారి అనుభవంలో అది కూడా ఓ సజీ వ ఉనికే. దానికి తనదైన వ్యక్తిత్వం ఉంటుంది. తనదైన భావావేశాలు, భావోద్వేగాలు, ఇంకా అనేక ఇతర లక్షణాలు ఉంటాయి.

మహోత్తుంగ.. శివగంగ

నది అనేది ఒక సజీవ ప్రక్రియ. గంగానది విషయంలో కూడా ఇది వాస్తవమే. నాకు గంగానది పుట్టుక ప్రదేశమైన గోముఖ్ వద్దకు వెళ్లే భాగ్యం దక్కింది. అలాగే, దాని ఉపనదులైన మందాకిని, అలకానంద, ఇంకా దాని ప్రధాన ఉపనది భాగీరథి వద్దకు కూడా వెళ్ళే అదృష్టం కలిగింది. హిమాలయాలపైన గంగాజలాలు స్వచ్ఛతకు, ఇంకా పవిత్రతకు ప్రతీక లు.

ఆపై గంగానది కిందకి మెట్టభూములలోకి ప్రవహిస్తుంది. భారతదేశ ఉపఖండంలో ఉత్తరాన ఉన్న ప్రజలకు అదే జీవనాడి. కాలగమ నంలో గంగానది ఎన్నో రాజుల వంశాలు రావడాన్నీ, ఇంకా కనుమరుగవడాన్నీ చూసిం ది. దేశంలో ఆ భాగంలోని ప్రజలకు, అది బలానికి ఇంకా అభ్యుదయానికి ఓ నిరంతర వనరుగా ఉంటూ వచ్చింది.

ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, మనం దాన్ని కేవలం ఓ వనరుగా చూస్తు న్నాం. పైన హిమాలయాలలో డ్యాములు కట్టాం. ఇలా చేయటం గంగానదిని ఓ సజీవ మాతృమూర్తిగా, ఇంకా దేవతగా చూసే అనేకమంది నొచ్చుకునేలా చేసింది. అలాగే, కింద మైదానాల దగ్గరకు వచ్చేసరికి, అది భారీగా కలుషితం అవుతున్నది. గంగానదిని మళ్లీ దాని పూర్తి స్వచ్ఛతకు తీసుకురావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. 

గోముఖ్ దుస్థితి

నేను ఇప్పటికి 30 ఏళ్ల నుంచి హిమాలయాలకు వెళుతున్నాను. గమనించింది ఏమిటంటే, అక్కడి మంచు పరిమాణంలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఒకప్పుడు దట్టంగా మంచుతో కప్పి ఉండే శిఖరాలు, ఇప్పుడు మంచు రహితంగా ఉన్నాయి. అవి ఉత్తగా, బల్లెం అంచులలా కనిపిస్తున్నాయి. దీనివల్ల గంగానదికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. గోముఖ్ ప్రారంభంలోని హిమానీనదాలు (గ్లేషియర్స్) కూడా చాలా వేగంగా తగ్గిపోతున్నాయి.

ఓ ఆవు ముఖంలా ఉంటుం ది కాబట్టే దానిని ‘గోముఖ్’ అన్నారు. నాకు బాగా గుర్తుంది, ఆగస్టు 1981లో నేను మొట్టమొదటిసారి అక్కడకి వెళ్ళినప్పుడు ఈ గుహలో నుంచి నీరు బయటికి ప్రవహించే ఆ ద్వారం, కేవలం 15 అడుగుల వెడల్పు మాత్రమే ఉండేది. అచ్చం ఆవు ముఖం వలెనే కనిపించేది.

ఇప్పుడది 200 అడుగుల వెడల్పు తో ఉంది. కావాలంటే, ఓ అరమైలు దూరం వరకూ లోపలకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వాతావరణ మార్పులు గంగానదిపై భారీ ప్రభావాన్నే చూపుతున్నాయి. ఒకవేళ అది గనుక గంగానది ఉనికికి అంతరాయం కలిగించిందంటే, భారతదేశంలోని ఉత్తరభాగంలో తరతరాలుగా గంగానదినే జీవనాడిగా చేసుకుని బతుకుతున్న ప్రజల జీవితాలలో ఓ పెద్ద విపత్తు చోటుచేసుకున్నట్టే.

ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం

దేశంలోని ప్రతీ సంస్కృతికీ, ప్రతి ఒక్కరికీ, ప్రతి నాగరికతకీ తమ ప్రజల జీవితాలలోని ఓ విభిన్న స్థాయి పవిత్రతను తిరిగి తీసుకురావడానికి, వారికి స్పూర్తిని ఇచ్చేందుకు ఏదో ఓ చిహ్నం (సింబలిజమ్) అవసరం. గంగానది అనాది కాలంగా ఆ పాత్రను పోషిస్తూ వచ్చిం ది. అలాగే, కుంభమేళా సమయంలో 8 కోట్లమందికి పైగా ప్రజలు ఓచోట చేరడం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశం ఈ నది ఒడ్డునే జరుగుతుంది.

ఇంత పెద్ద ఎత్తున మనుషులందరూ ఒకచోట సమావేశం అవ్వడమనేది ప్రపంచంలో మరెక్కడా జరగదు. ఈ స్ఫూర్తి వెనుక ఉన్నది గంగానది. ఇంకా ఆ నది ‘స్వచ్ఛతకు ప్రతీక’గా నిలుస్తున్న ది. ఈ ప్రతీక లేదా చిహ్నం చాలా ఆవశ్యకమైంది. కేవలం మన మనుగడ కోసం, మన అవసరాల కోసం మాత్రమే కాదు గానీ, మానవులలో స్ఫూర్తిని నింపడం కోసం ఈ నదిని కాపాడాలి, స్వచ్ఛంగా ఉంచాలి.