మట్టి పలకపై అక్షరాలు దిద్దడం మరిచిపోలేని అనుభూతి. చిన్నప్పుడు తల్లిదండ్రు లు మట్టి పలక కొనిచ్చి బడికి పంపి మురిసిపోయేవారు. అలా తొలి అక్షర ప్రయా ణం దానితోనే మొదలయ్యేది. ఓనమాలు నేర్పాలంటే మొదట గుర్తుకువచ్చేది మట్టి పలకనే. అలాగే చిటపట వానచినుకులు పడుతున్నప్పుడు.. గురువు మొట్టికాయ వేసినప్పుడు మట్టి పలక ఓ ఆధారంగా ఉండేది. నేడు మట్టి పలకల స్థానంలో స్మార్ట్ బోర్టులు, బుక్స్ ఎన్నో వచ్చాయి. కానీ ఎన్ని ఉన్నా.. మట్టి పలకకు సాటిరావు.