20-02-2025 11:29:23 PM
ఆమోదం తెలిపిన సెనెట్..
వాషింగ్టన్, ఫిబ్రవరి 20: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) చీఫ్గా భారత సంతతికి చెందిన కష్ పటేల్ నియామకానికి సెనెట్ ఆమోదం తెలిపింది. 44 ఏండ్ల పటేల్ ఈ పదవి చేపట్టబోతున్న మొదటి ఇండియన్ కావడం విశేషం. గతంలో ఇంటెలిజెన్స్ శాఖలో విధులు నిర్వర్తించిన పటేల్కు ట్రంప్ ప్రభుత్వం ఈ అత్యున్నత పదవి కట్టబెట్టింది.