calender_icon.png 20 October, 2024 | 4:19 PM

వాగులో కొడుకును తోసేసిన తండ్రి

20-10-2024 12:31:42 AM

తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి 

లభ్యంకాని బాలుడి ఆచూకీ 

కామారెడ్డి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కొడుకును ఓ తండ్రి వాగులో తోసేసిన ఘటన శనివారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన రాములు, గంగామణి దంపతులు. వారికి కుమారుడు పండరి(14), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే శనివారం పండరిని తండ్రి రాములు బాన్సువాడ పెద్దపూల్ వాగులో తోసివేసినట్లు భార్య గంగామణికి చెప్పాడు. ఆమె హుటాహుటిన పెద్దవాగు వద్దకు వెళ్లి పరిశీలించగా కుమారుడి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బాన్సువాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా కన్నే తండ్రే కొడుకును ఎందుకు వాగులో తోసి వేశాడో తెలియాల్సి ఉంది.