calender_icon.png 20 October, 2024 | 4:26 PM

రైతు భరోసా డబ్బులు వెంటనే వేయాలి

20-10-2024 01:00:41 PM

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు

సంగారెడ్డి  (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ముందు రైతు భరోసా డబ్బులు ఎకరాకు 15000 ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. వానకాలం ముగిసిపోయిన రైతు భరోసా డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు రైతు భరోసా డబ్బులు ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.