గుజరాత్కు చెందిన కుటుంబం రికార్డు
అహ్మదాబాద్, అక్టోబర్ 1: అన్ని దానాల్లో అవయదానం ఎంతో గొప్పదని అంటారు. అందులో రక్తదానం కూడా చేర్చవచ్చు. అత్యవసరంగా రక్తం అవసరమైనవారికి రక్తదానం చేస్తే ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన గుజరాత్లోని ఓ కుటుంబం ఏకంగా 630 లీటర్ల రక్తాన్ని దానం ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది.
అహ్మదాబాద్లోని మానెక్బాగ్లో నివసించే రమేశ్భాయ్ కుటుంబం ఈ అరుదైన ఘనత సాధించింది. ఈ కుటుంబంలోని నలుగురు సోదరులు, ఒక సోదరితోపాటు మొత్తం 27 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. వీరిలో 16 మంది ఇప్పటికే 50 సార్లు రక్తదానం చేశారు. ఈ 16 మందిలో నలుగురు శతాదిక వృద్ధులు కూడా ఉండటం విశేషం. వీరు ఇప్పటికే 100 సార్లు రక్తం దానం చేశారు. ఈ కుటుంబం మొత్తంగా 1400 యూనిట్ల రక్తం దానం చేసింది.