హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): బ్యాంక్ ఆఫ్ బరోడ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో రీజియన్ ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ పద్మారావు నగర్, చిలుకలగూడలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ మెట్రో రీజియన్ రీజినల్ హెడ్ ఆదిత్య కుమార్ కన్నౌజియా, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ప్రవాకర్ ఝపత్సింగ్ పాల్గొన్నారు.