calender_icon.png 30 September, 2024 | 3:06 AM

పూలంగ్ వాగు ఆక్రమణలు తొలిగించాలి

30-09-2024 01:00:30 AM

మేధావుల సంఘం  చైర్మన్ కేశవులు

నిజామాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని పూలాం గ్ వాగులో ఆక్రమణలను తొలగించి, కబ్జా నుంచి కాపాడాలని రాష్ట్ర మేధావుల సంఘం చైర్మన్ కేశవులు ఆదివారం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. మహేష్‌కుమార్‌గౌ డ్‌ను కేశవులు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిసి విన్నవించారు.

నిజామాబా ద్ నగరంలోని పూలాంగ్ వాగు ఆక్రమణలపై మహేష్‌గౌడ్‌కు వివరించారు. అలాగే నిజామాబాద్ నగరంలోని రామర్తి చెరువు, నాగారంలోని బొందెం చెరువు ఆక్రమణలపై సైతం చర్యలు తీసుకోవాలని కేశవులు కోరారు.