calender_icon.png 25 October, 2024 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతి అదృశ్యం

15-07-2024 12:18:25 AM

ముషీరాబాద్, జూలై 14: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రాజు కథనం ప్రకారం.. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో నివాసముంటున్న సంపత్, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు కుసుమ కుమారి (21) అమెజాన్ ప్యాకింగ్ సెక్షన్‌లో ఉద్యోగం చేసేది. 3 నెలల క్రితం ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ నెల 12న ఇప్పడే వస్తానని తల్లి సుజాతకు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియ రాలేదు. తమ బంధువైన కార్తీక్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఆదివారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపారు.