01-04-2025 02:10:06 AM
మూసాపేట మార్చి 31 : మూసాపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని జామే మజీద్ నుంచి ఈద్గాకు చేరుకొని నమాజ్ ఫాత్యహ సలాం చదివి ఒకరికొకరు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్,కండక్టర్ నారాయణ, రత్నయ్య, నల్ల తిరుపతయ్య గౌడ్, మజ్జిద్ ఇమామ్ ముక్తార్ మన్సూర్ ఖాద్రి, యువకులు. గ్రామస్తులు. పెద్దలు. పాల్గొన్నారు.