calender_icon.png 25 October, 2024 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు డివైడర్ నిర్మాణ పనులను పరిశీలించిన... కార్పొరేటర్

25-10-2024 04:39:10 PM

కూకట్‌పల్లి (విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానందనగర్ కాలనీలో సుమారు కోటీ 50 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న రోడ్డు డివైడర్ నిర్మాణ పనులను శుక్రవారం వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజా దేవి రంగారావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా వివేకానంద నగర్ కాలనీలో సెంటర్ డివైడర్ ఏర్పాటు చేయకపోవడంతో కాలని వాసులతోపాటు పాదాచారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె అన్నారు.

దీనికి తోడు తరచు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ సమస్య ఉండేది అన్నారు. సెంటర్ డివైడర్ నిర్మాణ పనులు పూర్తయితే పాదాచారులకు రోడ్డు క్రాస్ చేసేందుకు సులువుగా ఉంటుందన్నారు. డివైడర్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి గడువులోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, జిహెచ్ఎంసి ఏఈ శ్రావణి, వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, రామకృష్ణ స్ట్రీట్ అధ్యక్షులు పురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.