12-02-2025 01:56:44 AM
పెద్దపల్లి, ఫిబ్రవరి11: పెద్దపల్లి ఐటిఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను మార్చి 1,2025 నాటికి పూర్తి చేయాలని లేబర్, ఎంప్లాయిమెంట్ రాష్ర్ట ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జలేబర్ , ఎంప్లాయి మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి పరిశీలించారు.
ఆరు ట్రేడ్ లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటిఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటిసి ( అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) భవన నిర్మాణ పనులను మార్చి 1,2025 నాటికి పూర్తి చేయాలని, నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత పరికరాలను అమర్చెందుకు చర్యలు తీసుకొ వాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు. 6 ట్రేడ్ కోర్సులకు సంబంధించి పరికరాలు ఐటిఐ కు చేరు కున్నాయని, భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే సంబంధిత పరికరాలను ఇన్ స్టాల్ చేసి యువతకు శిక్షణ తరగతులు ప్రారంభించవచ్చని అన్నారు.
భవన నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటిసి సెంటర్ ప్రాంగణం లో కలెక్టర్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ మొక్కలు నాటారు. ఈ పర్యటనలో ప్రిన్సిపాల్ సెక్రటరీ వెంట ఐటిఐ ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి వెంకటరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.