calender_icon.png 9 October, 2024 | 8:45 PM

రైతులను మోసం చేసిన సీఎం

09-10-2024 12:02:56 AM

ఆయనపై చర్యలు తీసుకోవాలి

మాజీ మంత్రి జోగు రామన్న

రేవంత్‌రెడ్డిపై డీఎస్పీకి ఫిర్యాదు

ఆదిలాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): రుణమాఫీ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశాడని మాజీ మంత్రి జోగు రామన్న ధజంమెత్తారు. సయంగా ప్రధానికి సైతం పచ్చి అబద్ధాలతో కూడిన లేఖలు పంపుతున్నారని విమర్శించారు. రాష్ర్టంలో ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నప్పటికీ ప్రభుతం పట్టించుకోవడంలేదన్నారు.

మంగళవారం ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ జీవన్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

రుణమాఫీ చేయని ప్రభుత వైఖరిని ఖండిస్తూ సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో జిల్లా సమనయ అధ్యక్షుడు రోకండ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇజ్జగిరి నారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్‌లు మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగరావు, కుమ్ర రాజు, నవాతే శ్రీనివాస్, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.