మేడిపల్లి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. నిందితులు అప్పుడే పుట్టిన చిన్నారిని అమ్మకానికి పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు 3 నెలల చిన్నారిని విక్రయానికి పెట్టిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణానగర్ లోని శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రూ. 4 లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని డాక్టర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. నిందితులు రూ. 10 వేలు అడ్వాన్స్ గా కూడా తీసున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.