calender_icon.png 28 October, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారిని అమ్మకానికి పెట్టిన నిందితులు

22-05-2024 04:47:19 PM

మేడిపల్లి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. నిందితులు అప్పుడే పుట్టిన చిన్నారిని అమ్మకానికి పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు 3 నెలల చిన్నారిని విక్రయానికి పెట్టిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణానగర్ లోని శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రూ. 4 లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని డాక్టర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. నిందితులు రూ. 10 వేలు అడ్వాన్స్ గా కూడా తీసున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.