హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): శాసన మండలి చీఫ్ విప్గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి నియామకమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్రెడ్డిని మహేందర్రెడ్డి జూబ్లీహిల్స్ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, కాలెలే యాదయ్య, మనోహర్రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు హరివర్దన్రెడ్డి, రోహిన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, నేతలు వజ్రేష్యాదవ్, పరమేశ్వర్రెడ్డి, కొలను హనుమంత రెడ్డి తదితరులు ఉన్నారు.