calender_icon.png 2 October, 2024 | 12:02 PM

సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పెంచాలి

02-10-2024 12:31:18 AM

ఏబీవీపీ విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్ 1(విజయక్రాంతి): డీఎస్సీకి ఎంపికైన వారిలో బీఎడ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు చాలా మంది ఉన్నారని, అయితే వర్సిటీ తుది ఫలితాలు రాక సర్టిఫికె ట్స్ పొందే అవకాశం లేకపోవడంతో వారికి వెసులుబాటు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ విజ్ఞప్తి చేశారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కనీసం ఒక నెల రోజు లు గడువు ఇవ్వాలని, లేకుంటే ఎంతో మం ది ఉద్యోగావకాశాలు కోల్పోతారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్సిటీ పరీక్షలు తర్వగా నిర్వహించి, ఫలితాలు వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.