calender_icon.png 27 September, 2024 | 3:12 AM

డబ్బులు లాగడం కోసమే నాపై కేసు

26-09-2024 01:48:08 AM

నేనేంటో నా ఫాలోవర్స్‌కు బాగా తెలుసు

త్వరలో నా న్యాయవాదితో కలిసి వివరాలు చెప్తా..

తనపై నమోదైన కేసుపై యూట్యూబర్ హర్షసాయి స్పందన

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 25: ‘నాపై డబ్బు లాగడం కోసమే యువతి నాపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేనేంటో నా ఫాలోవర్స్‌కు తెలుసు. త్వరలో నేను నా న్యాయవాదితో కలిసి అన్ని  వివరాలు వెల్లడిస్తాను’ అని యూట్యూబర్ హర్షసాయి సోషల్‌మీడియా వేదికగా స్పం దించారు.

హర్షసాయి తనపై అత్యాచారం చేసి, న్యూడ్ ఫొటోలు, వీడియోలను చూపించి హర్షసాయి బ్లాక్ మెయిల్ చేశాడని, తన నుంచి రూ.2 కోట్లు తీసు కున్నాడని మంగళవారం ఓ యువ తి నార్సింగ్ పోలీసులను ఆశ్రయిం చి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బుధవారం హర్షసాయి ప్రతిస్పందించారు.

కేసుపు హర్షసాయి తరఫు లాయర్ మాట్లాడుతూ.. తన క్లుంట్‌పై దురుద్దేశ పూర్వకంగా యువతి కేసు పెట్టిందని ఆరోపించారు. సదరు యువతికి హర్షసాయి మధ్య ఎలాంటి ప్రేమ, పెళ్లి వ్యవహారం లేదన్నారు. తన క్లుంట్ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. హర్షసాయి నటించిన చిత్రం టీజర్‌కు భారీ స్పందన రావడంతోనే ఓర్వలేక యువతి ఆరోపణలు చేస్తోందన్నారు.

మరోవైపు హర్షసాయి, పోలీసులను ఆశ్రయించిన యువతి మొబైల్ సంభాషణ పేరుతో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. యువతి నిర్మాతగా మారి హర్షసాయితో సినిమా తీస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమా విషయంలోనే ఇద్దరి మధ్య స్పర్థలు వచ్చినట్లు సమాచారం.