- నలుగురికి గాయాలు,
- నార్సింగిలో ఘటన
రాజేంద్రనగర్, ఆగస్టు11: రాంగ్ రూట్లో వచ్చిన కారు.. టిప్పర్ను ఢీకొనడంతో నలుగురికి తీవ్రగాయాలైన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. శనివారం అర్ధరాత్రి 2:30 గంటలకు డయల్ 100కు కాల్ రావడంతో పోలీసులు నార్సిం గి సర్వీస్ రోడ్డు మై హోం అవతార్ కూడలి వద్దకు చేరుకున్నారు. నార్సింగి నుంచి వెళ్తున్న వ్యాగనార్ కారును గచ్చిబౌలి నుంచి వస్తున్న టిప్పర్.. మై హోం అవతార్ కూడలి వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సుదీప్, గౌతమ్, శ్రీఈశ్వర్, టిప్పర్ డ్రైవర్ సతీష్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.