calender_icon.png 28 September, 2024 | 2:53 AM

లారీని ఢీకొన్న బస్సు

28-09-2024 12:36:27 AM

13 మందికి గాయాలు 

ఖమ్మం, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి  మండలం సీతారామపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ఉల్లిపాయాల లోడుతో వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో నడపడం వల్లే ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. క్షతగాత్రులను పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.