* బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు
హుజురాబాద్, ఫిబ్రవరి4: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద మధ్యతరగతి సంక్షే మానికి పెద్దపీట వేశారని బిజెపి పట్టణ అధ్యక్షుడు తుర్పడి రాజు అన్నారు. కరీంనగ ర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబే ద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం ప్రధాని మోడీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
12 లక్షల వరకు టాక్స్ మినహాయింపు కోట్లాదిమందికి గొప్ప శుభవార్త అని అన్నా రు. 50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపుల నుప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని , అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చారిత్రక బడ్జెట్ ను ప్రవేశపెట్టారనిఅన్నారు. బడ్జెట్లో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కేటాయింపు లు జరిగాయన్నారు. ప్రధానంగా రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం , స్కిల్ డెవల ప్మెంట్ లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అందుకు తగిన విధంగా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారన్నారు.