నలుగురు జవాన్లు మృతి, 30 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్, సెప్టెంబర్ 20: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిన ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్లోని బుడ్గాం జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుంది. విధుల్లో భాగంగా 7 బస్సుల కాన్వాయ్ బయలుదేరగా బ్రెల్ గ్రామం వద్ద అందులోని ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. స్థానికులు, బలగాలు సహాయ చర్యలు చేపట్టాయి.