ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20
అమెరత్: ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20లో భారత జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న తిలక్ సేన.. ఒమన్తో జరిగిన మ్యాచ్లో కూడా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేసింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆయుష్ బదోని అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.