calender_icon.png 10 October, 2024 | 6:58 PM

ట్రాక్టర్ ట్రాలీ కింద పడి బాలుడు మృతి

09-10-2024 12:00:00 AM

  1. ట్రాక్టర్‌ను గేర్‌లో పెట్టి మర్చిపోయిన తండ్రి
  2. బాలుడు ఆడుతూ వెళ్లి గేర్లు వేయడంతో బోల్తా..

కామారెడ్డి, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ట్రాక్టర్ ట్రాలీ కింద పడి బాలుడు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్ చెరువు ముందటి తండాలో మంగళవారం చోటు చేసుకుంది. ముందటి తండాకు చెందిన రమావత్ భాస్కర్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇంటి సమీపంలో రమావత్ భాస్కర్ తన ట్రాక్టర్‌తో పని ముగించుకుని సమీపంలో ట్రాక్టర్‌ను నిలిపాడు. ట్రాక్టర్ గేరు వేసి ఉన్న విషయాన్ని మర్చిపోయి కామారెడ్డికి పని నిమిత్తం వెళ్లాడు. భాస్కర్ కుమారుడు రిషికేష్(6) ఆడుకుంటూ ట్రాక్టర్ పైకి ఎక్కి గేర్లు మార్చాడు.

దీంతో పల్లపు ప్రదేశంలో ఉన్న ట్రాక్టర్ ముందుకు వెళ్లి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌పై ఉండి ఆడుతున్న రిషికేష్ ట్రాక్టర్ ట్రాలీ కింద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.