* ఇద్దరు దుర్మరణం
జనగామ, అక్టోబర్ 20 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మినీవ్యాన్ను ఢీకొనడంతో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని గొల్లపల్లి వద్ద చోటు చేసుకుంది. ఏపీ లోని కర్నూలు జిల్లాకు చెందిన బో య నర్సింహా(20), తెలంగాణలోని వనపర్తి జిల్లా మదనపురం గ్రామానికి చెందిన చీరోలు భరత్(22) జనగామలో జిల్లాలో ప్లంబింగ్ పను లు చేస్తున్నారు.
వీరిద్దరు ఆదివారం కొడకండ్ల మండలంలోని రామన్నగూడెంలో ఓ ఇంట్లో పనులు చేసి మధ్యాహ్న భోజనం చేసేందుకు దేవరుప్పులకు బైక్పై బయల్దేరారు. అదే సమయంలో దేవరుప్పుల మం డలం సింగరాజుపల్లికి చెందిన రాపా క ఉప్పలయ్య, రాపాక లక్ష్మి, కొంగరి భాస్కర్ మినీవ్యాన్లో సూర్యాపేట వైపు వెళ్తున్నారు. బైక్ నడుపుతున్న నర్సింహా గొల్లపల్లి స్టేజీ వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మి నీవ్యాన్ను ఢీకొట్డాడు.
బైక్పై ఉన్న నర్సింహా, భరత్ అక్కడికక్కడే మృతిచెందారు. మినీవ్యాన్లో ఉన్న ము గ్గురికి తీవ్ర గాయాలు కాగా దేవరుప్పుల ఎస్సై సృజన్ వారిని జనగామ ఆస్పత్రికి తరలించారు. రాపాక ఉప్పల య్య, కొంగరి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.