calender_icon.png 25 October, 2024 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశీ లో అత్యుత్తమ ప్రతిభ

25-10-2024 01:13:32 PM

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన తేరాల రమేష్ బాబు కలెక్టర్ గారి చేతుల మీదుగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (దేశీ) లో అత్యుత్తమ ప్రతిభలో గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వ్యవసాయంలో లాభసాటి విధానంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలను రైతులకు తెలియజేస్తూ ఏ రకమైన సాగుచేస్తే రైతుకు ఉపయోగపడుతుంది, పంటల సాగువిదానం, తదితర అంశాలపై దాదాపు 12 నెలల పాటు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్  సర్వీసెస్  ఫర్  ఇన్పుట్  డీలర్స్ (దేసి) ట్రైనింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గోల్డ్ మెడల్ తో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సత్కరించారు. దేశీ లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి మండలంకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చినా తేరాల రమేష్ బాబును మండల ప్రజలు అభింనదించారు.