calender_icon.png 4 February, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా సినిమాకు ప్రేక్షకులే హీరోలు!

04-02-2025 12:00:00 AM

సాయిరామ్ శంకర్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విహాన్ ఫిల్మ్స్ -విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై గార్లపాటి రమేష్‌తో కలిసి నిర్మిస్తూ వినోద్ కుమార్ విజయన్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్ మీడియాతో ముచ్చటించారు.

“చాలా చిన్న వయసులో మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇ చ్చాను. నేను అక్క డ ప్రొడక్షన్ చేశా ను. చాలా చిత్రాలను నిర్మించాను. దర్శకత్వం వహించాను. నేను చేసిన చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఫాహద్ ఫాజిల్‌ను, గోపీ సుందర్ వంటి వారిని ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశా ను. చిన్నప్పుడు మా ఇంటి పక్కన తెలుగు వాళ్లుండే వారు. వారింట్లోనే ఎక్కువగా ఉండేవాడిని. అలా నాకు తెలుగు అలవాటైంది. ఆ టైంలో వారింట్లో నేను ఎన్టీఆర్ గారి సినిమాలు చూసేవాడిని.

తెలుగులో నాకు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. పైగా నాకు సాయిరామ్ శంకర్ ఎప్పటి నుంచో తెలుసు. ఓ సారి ఈ కథ గురించి చెప్పాను. అలా ఈ సినిమా జర్నీ ప్రారంభమైంది. ‘ఒక పథకం ప్రకారం’ ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ఈ శుక్రవారం మాత్రం ప్రేక్షకులు చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను చూడబోతున్నారు.

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుంది. అందుకే ఇంటర్వెల్‌లోనే విలన్ ఎవరో కనిపెట్టండని ముందే సవాల్ విసురుతున్నాం. ఇంటర్వెల్ తరువాత విలన్ ఎవరో కనిపెడితే రూ.పది వేలు ఇస్తాం. 50 థియేటర్ల నుంచి థియేటర్‌కి ఒకరు చొప్పున 50 మంది విజేతలకు రూ.10 వేల చొప్పున బహుమతిని అందిస్తాం. మా సినిమాను వీలైనంత వరకూ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ సినిమా విషయానికి వస్తే ఆడియెన్సే హీరో.