రామ్కార్తీక్, కశ్వి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకత్వంలో తెరకెక్కి, ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఆదివారం హైదరాబాద్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో రామ్కార్తీక్ మాట్లాడుతూ.. ‘నేను కొన్ని థియేటర్స్కి వెళ్లి చూస్తే, అక్కడ అంతా పాజిటివ్ టాక్ వినిపించింది. మమ్మల్ని ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది’ అన్నారు. డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. ‘మా సినిమా ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి, నటులు శ్రీరామ్, శ్రీనివాస్, ఫణి, పలువురు చిత్రబృందం పాల్గొన్నారు.