తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్
ముషీరాబాద్, జూలై 21: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంపై ఈ నెల 23 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లోమాట్లాడుతూ.. ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, తెలంగా ణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పా టు చేసి రూ. 10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. నిరుద్యోగ ఉద్యమకారులకు వడ్డీలేని రుణాలు అందజేయాలన్నారు. ఉద్యమ జర్నలిస్టులను గుర్తించి వారికి ఉచి త ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, జానకిరెడ్డి, నరేందర్ గౌడ్, ఇంద్రకుమార్, యాదిరెడ్డి, వీరస్వామి, కొండ స్వామి, దయానంద్, భాస్కర్, కిరణ్ కుమార్, శ్రీనివాస్, పోచయ్య, రామచందర్, కీర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.