calender_icon.png 26 October, 2024 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజ్ గంగపుత్ర కులాలను అభివృద్ధి చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొన్నం

26-10-2024 05:02:50 PM

హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం లోని శనిగరం మధ్యతరహా ప్రాజెక్టులోకి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ.. ముదిరాజ్ గంగపుత్ర కులాలకు ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గతానికి మించి వంద శాతం రాయితీతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని శనిగరం ఫిష్ ఫాంను అభివృద్ధి చేస్తాం అని అన్నారు. శనిగరం గ్రామంలో ఫిష్ మార్కెట్ నిర్మాణం చేస్తాం అని స్థలం సేకరణ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ అతిథి గృహన్ని పునరుద్ధరణ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి అదనపు ఫిషరీస్ డైరక్టర్ శంకర్ ఆర్డీఓ రామ్మూర్తి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కెడం లింగమూర్తి పూజల హరికృష్ణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.