calender_icon.png 11 April, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక్ఫాయ్, టీ హబ్ మధ్య ఎంవోయూ

26-03-2025 12:49:11 AM

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యం

చేవెళ్ల, మార్చి 25: స్టార్టప్ ల అభివృద్ధి,  యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఇక్ఫాయ్ ఇంక్యూబేటర్ , టీ హబ్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు మంగళవారం శంకర్ మండలం దొంతాన్ పల్లిలోని క్యాంపస్లో ఇక్ఫాయ్ వైస్ ఛాన్సలర్, టీహబ్ చీఫ్ ఇన్నేవేషన్ ఆఫీసర్ సుజిత్ జాగిర్దార్  ఎంవోయూ (మొమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్)పై సంతకాలు చేసి..  ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.  ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, రీ సెర్చ్ స్కాలర్స్,  యువ పారిశ్రామిక వేత్తలకు ఇక్ఫాయ్ చక్కటి వేదికగా మారనుందని తెలిపారు. 

టీ-హబ్ నైపుణ్యంతో  ఇక్ఫాయ్ విద్యా సంస్థల శక్తిని  సమన్వయం చేసి స్టార్టప్ ల ఆవిష్కరణ, శిక్షణ,  నిధులు,  మార్కెట్ యాక్సెస్ కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. స్టార్టప్ ప్రాజెక్టులను ఇంటర్న్ షిప్ గా ఎంచుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు.  టీ-హబ్ సీఐవో సుజిత్ జాగిర్దార్ మాట్లాడుతూ..   స్టార్టఫ్ లను ప్రోత్సహించడంలో టీహబ్ ముందు వరుసలో ఉంటుందని, ఇక్ఫాయ్తో  ఒప్పందం ద్వారా మరిన్ని వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే అవకాశం దక్కిందన్నారు.  పరిశోధన , పారిశ్రామిక ఆవిష్కరణల మధ్య వారధిగా  పనిచేస్తామని స్పష్టం చేశారు.  ఇక్ఫాయ్ ఇంకుబేటర్ ఎక్టిక్యూటివ్ డైరెక్టర్ సాయినాథ్ మణికొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  టీ హబ్ ప్రతినిధులు సీనియర్ ఇన్వెస్టర్  స్టార్టప్ ఫండ్ డైరెక్టర్ దేవిశెట్టి చింటిరెడ్డి, ఛీఫ్ డెలివరీ ఆఫీసర్ ఫణి కొండెపూడి, ఇక్ఫాయ్ రిజిస్టార్ డాక్టర్ విజయలక్ష్మి,  బ్రాండింగ్ డైరెక్టర్ సుధాకర్ రావు,  డైరెక్టర్లు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.