- వివిధ పార్టీలు, కుల, ప్రజా సంఘాల నాయకుల
- చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు
గద్వాల(వనపర్తి), అక్టోబర్ 26 (విజయక్రాంతి): దొంగతనం నెపం మోపి బాలిక ఆత్మహత్యకు కారుకుడైన సీడ్ వ్యాపారి బండ్ల రాజశేఖర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కుల, ప్రజా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎస్పీ శ్రీనివాస రావుకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలికను ఇంట్లో వెట్టి చేయించుకోవడంతోపాటు దొంగతనం నెపం మోపడం, ఫోన్ ఫిర్యాదుకు స్పందించి విచారణ చేపట్టిన మల్దకల్ పోలీసులపై సమగ్ర విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలను చేపట్టాలని విజ్ఞప్తిచేశారు.