మీరా చోప్రా గుర్తుండే ఉంటుంది. బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మరో మూడు సినిమాలు చేసి టాలీవుడ్కు గుడ్ బై చెప్పింది. తమిళ్లో కొన్ని సినిమాలు చేసింది. అయితే తెలుగు, తమిళ సినిమాల సక్సెస్ను బాలీవుడ్లో మాత్రం కొనసాగించలేకపోయింది. ఈ భామ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల సోదరి.
ఇటీవలే బాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో సక్సెస్ కోసం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే దక్షిణ సినీ పరిశ్రమలో కొనసాగడం గురించి మీరా చోప్రా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాదిలో తానెప్పుడూ అవకాశాల కోసం వెదుక్కోలేదని తెలిపింది.
అయితే తను పంజాబీ కావడంతో సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది కాదని తెలిపింది. తనకు భాష పెద్ద సమస్యగా మారుతోందని వెల్లడించింది. తాను దక్షిణాది సినిమా చేస్తున్నప్పుడల్లా ‘ఇదే నా చివరి సినిమా’ అని చెప్పేదాన్నని మీరా చోప్రా తెలిపింది.
అలా చెబుతూనే 25 సినిమాలు పూర్తి చేశానని వెల్లడించింది. వాళ్లు సినిమాలు ఆఫర్ చేయడంతో పాటు మంచి రెమ్యూనరేషన్ ఇస్తుండటంతో తాను టెమ్ట్ అయ్యేదాన్నని మీరా చోప్రా తెలిపింది. తెలుగులో మీరా చోప్రా ‘బంగారం’తో పాటు ’వాన, మారో, గ్రీకువీరుడు’ చిత్రాల్లో నటించింది.