తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆ ఇద్దరూ భారతీయ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలే. ఒకే గురువు (దివంగత తమిళ దర్శకుడు బాలచందర్) వద్ద శిష్యరికం చేసిన నట సార్వభౌములే. ఆ నటద్వయంలో ఒకరు.. అభిమానులు తలైవాగా పిలుచుకునే రజనీ కాంత్ అయితే, ఉలనాయగన్గా పేరొందిన కమల్హాసన్ రెండో వ్యక్తి. ఇంత గొప్ప పేరున్న వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే చూసి తరించాలన్న ఆశ ఎవరికుండదు చెప్పండి. మరి వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్పై కనిపించలేదా?.. అంటే కానే కాదు! వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలెన్నో చూసి అభిమా నులుగా మారిపోయినవారి సంఖ్య భారీగానే ఉంటుంది.
నట దిగ్గజా లను ఒకే తెరపై చూడాలన్న ఈతరం సగటు ప్రేక్షకుల్లో బలంగా ఉన్న ఆ కోరికను ఇటీవల ఓ జర్నలిస్టు ఉలగ నాయగన్ ముందుంచగా, ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తికర మైన వార్తగా మారింది. ‘భవిష్యత్తులో ఇద్దరూ కలిసి సినిమా చేస్తారా? లేక ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలో అయినా కనిపించే అవకాశం ఏమైనా ఉందా?’ అన్నదే కమల్హాసన్కు ఎదురైన ప్రశ్న. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘ఇదేమీ కొత్త కాంబినేషన్ కాదు.. ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. ఆ తర్వాత కలిసి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాం. మా ఇరవై ఏళ్ల వయసులోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.
ఇప్పుడే దో ముసలివాళ్లమయ్యాం.. మరింత తెలివైన వాళ్లం అయ్యాం అని మేము అనుకోవడంలేదు. మేమిద్దం ఎప్పుడూ పోటీదారుల్లాగా కాకుండా ఒకే గురువు వద్ద నుంచి వచ్చినవాళ్లం. ప్రతి దగ్గరా ఉన్నట్టే మా మధ్యా పోటీ ఉంటుంది.. కానీ శత్రుత్వం లేదు. ఇద్దరివీ ఇప్పుడు వేర్వేరు దారులు. ఒకరి గురించి ఒకరం నెగెటివ్ కామెంట్స్ చేసుకోం’ అన్నారు కమల్. ఇదిలా ఉండగా, ఇటీవల విడుదలైన ‘కల్కి2898ఏడీ’లో కమల్ ‘సుప్రీమ్ యాస్కిన్’ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆయన మరో చిత్రం ‘భారతీయుడు2’ ఈ నెల 12న విడుదలకు సిద్ధంగా ఉంది.