మాజీ ఎమ్మెల్యేల మృతికి అసెంబ్లీ సంతాపం
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ఇటీవల మృతి చెందిన మా జీ ఎమ్మెల్యేలకు బుధవారం తెలంగాణ శాసన సభలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు నెమరగొమ్ముల సుధాకర్రావు, విరాసత్ రసూల్ఖాన్, శ్రీనివాస్, రమేష్ రాథోడ్ల మృతిపట్ల సభ సం తాపం వ్యక్తం చేసింది. ప్రజా ప్రతినిధులుగా వారు రాష్ట్రానికి అందిం చిన సేవలను వివరిస్తూ సంతాప ప్రతిపాదనలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ చదివి వినిపించారు.