calender_icon.png 22 September, 2024 | 12:45 PM

ముత్తారంలో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు

22-09-2024 10:38:51 AM

ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం

ముత్తారం(విజయక్రాంతి): ముత్తారం మండలానికి మెడికల్ హెల్త్ సబ్ సెంటర్ కొరకు రూ. 20 లక్షలు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం  ముత్తారం మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. మారుమూల మండలమైన ముత్తారం మండలానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి మంత్రి శ్రీధర్ బాబు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయనున్నాడని సదానందం తెలిపారు.