28-01-2025 06:38:15 PM
మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పద్మ...
ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని మచ్చుపేట గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా నాలుగు గ్యారంటీలను అమలు చేయడం కొరకై రాష్ట్ర ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మచ్చుపేట గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినందుకు గాను ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చుపేట మాజీ సర్పంచ్ గోవిందుల పద్మ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు, యువ నాయకుడు శ్రీనుబాబు సహకారంతో మచ్చుపేట గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.