స్టార్ హీరో విక్రమ్ తాజా చిత్రం ‘తంగలాన్’. మాళవికా మోహనన్, పార్వతీ తొరువొత్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది నిర్మాణం సంస్థ. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది.
అయితే, ఈ ప్రాజెక్టులో సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న జీవీ ప్రకాశ్కుమార్ తన ఎక్స్ ఖాతాలో ‘తంగలా న్’ గురించి తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. “సినిమా మ్యూ జిక్ పనులు పూర్తయ్యాయి. నాకు సాధ్యమైనంత వరకు మంచి స్వరాలు సమకూర్చా ను. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ‘తంగలాన్’ రూపంలో మరో భారతీయ సినిమా చరిత్ర సృష్టించబోతు న్నది” అని ఆయన రాసుకొచ్చారు.