calender_icon.png 28 October, 2024 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17న ‘గణేష్ నిమజ్జన’ సెలవు

14-09-2024 12:33:56 AM

జంట నగరాలు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే

విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవు

నవంబర్ ౯న రెండో శనివారం పనిదినం

ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17వ తేదీకి బదులుగా నవంబర్ 9వ తేదీన పనిదినంగా ప్రకటించారు. ఆ రోజు రెండో శనివారం సెలవు ఉండదు.