పాల్గొనున్న స్పీకర్, మండలి డిప్యూటీ చైర్మన్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రెండు రోజుల పాటు ఢిల్లీ లో జరిగే పదో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజి యన్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఆదివారం హస్తినాకు బయలు దేరారు. సోమ, మంగళ వారాల్లో జరి గే 10వ కాన్ఫరెన్స్లో వీరు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా రు. వీరి వెంట అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు, జాయింట్ సెక్రటరీ ఉపేందర్రెడ్డి కూడా ఉన్నారు.