calender_icon.png 17 October, 2024 | 4:56 AM

గ్రూప్-1 మెయిన్స్‌కు టీజీపీఎస్సీ ఏర్పాట్లు

16-10-2024 02:25:08 AM

21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పకడ్బందీగా పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ దృష్టిసారించింది. మెయిన్స్ పరీక్షలకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉండడంతో పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చేస్తోంది.

ఈనెల 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మెయిన్స్ హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈనెల 14 నుంచి అందుబాటులో ఉంచడంతో అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలను ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. గ్రూప్-1 మల్టీపుల్ ఇష్యూస్, ఫైనల్ కీ కేసులను కొట్టివేసిన హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్‌లో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు పిటిషనర్లు దాఖలు చేయనున్నారు. ఈ కేసు నేడు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గ్రూప్ మరికొన్ని కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.