calender_icon.png 24 March, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువులోగా వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలి

22-03-2025 12:45:45 AM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల, మార్చి 21(విజయ క్రాంతి): సిరిసిల్ల జిల్లా చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన ఆర్డర్లను నిర్ణిత సమయంలో వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని  సమావేశ మందిరంలో ప్రభుత్వ  ఆర్డర్ల పురోగతి పై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులతో  సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ  సమగ్ర శిక్ష శాఖ, సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అందించిన ఆర్డర్ల వస్త్ర ఉత్పత్తిని నిర్ణీత సమయంలో పూర్తిచేసి సప్లై చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు ఒక్కొక్కరికి రెండు చీరలు చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి సంబంధిత ఆర్డర్ ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేటాయించడం జరిగిందని అన్నారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద చీరల పంపిణీ కోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు వచ్చిన ఆర్డర్ పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో గడువులోగా ఉత్పత్తి చేసి సప్లై చేయాలని అన్నారు. చేనేత జౌళి  శాఖ అధికారి రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య,వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.