ముంబై, అక్టోబర్ 25: ప్రముఖ పారిశ్రమికవేత్త రతన్టాటా అక్టోబర్ 9న మరణిం చడంతో ఆయన ఆస్తుల పంపకంపై అందరి దృష్టి పడింది. తన సంపదను ఎవరెవరికి ఎంత కేటాయించారో వీలునామాలో రాసినట్లు తెలుస్తోంది. తన పెంపుడు శునకం టీటోతోపాటు తన వ్యక్తిగత సిబ్బందికి సైతం తన ఆస్తిని పంచినట్లు వార్తలు వస్తున్నాయి. టాటా అంత్యక్రియల రోజు ఆయ న మృతదేహం వద్ద టీటో కన్నీరు కార్చుతూ దిగాలుగా ఉన్న సంగతి తెలిసిందే. టీటో జీవితకాల సంరక్షణ కోసం సంపదను కేటాయిస్తూ వీలునామాలో పేర్కొన్నారు. టీటో బాగోగులను ఎన్నో ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న రాజన్షా చూడనున్నారు. అలాగే దాదాపు ముప్పు ఏండ్లుగా తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బంది రాజన్ షా, సుబ్బయ్యలకు కూడా వాటా ఇచ్చారు.