కథువా: జమ్ముకశ్మీర్ లోని కథువా జిల్లా మచెడి ప్రాంతంలో సోమవారం ఉగ్రదాడులు మరోసారి రెచ్చిపోయారు. కథువాలో ఆర్మీ జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందగా.. మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.
రెండు రోజుల వ్యవధిలోనే రెండోసారి సైనికుల వాహనంపై ఉగ్రవాదులకు కొండ పైనుంచి కాల్పులు జరిపారు. కాగా. ఆదివారం కుల్గామ్ జిల్లాలో రెండు వేర్వేరు ఎన్ కౌంటర్ లో ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. జవాన్లకు టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు వీరమారణం పొందారు.