calender_icon.png 29 September, 2024 | 4:49 PM

సొంత తప్పిదాల వల్ల పాకిస్థాన్లో ఉగ్రవాదం

29-09-2024 02:29:25 PM

న్యూఢిల్లీ: సొంత తప్పిదాల వల్ల పాకిస్థాన్లో ఉగ్రవాదం పెరిగిందని కేంద్రమంత్రి జై శంకర్ అన్నారు. ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశాన్ని మింగేస్తోందని తెలిపారు. ఇందుకు ప్రపంచాన్ని నిందించి లాభం లేదన్నారు. పాకిస్థాన్ వల్ల పొరుగు దేశాలు ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదం, అక్రమ చొరబాట్లును పాకిస్థాన్ ఆపివేయాలని హెచ్చరించారు. అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగం, ఉగ్రవాదంతో ఆ దేశానికి ఉన్న సుధీర్ఘ అనుబంధం అని కేంద్రమంత్రి జై శంకర్ పేర్కొన్నారు.