మహబూబాబాద్: రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు ఓ విద్యార్థిని రూ.3 వేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మహబూబాబాద్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు తన కిట్టీ బ్యాంకులో దాచ్చుకున్న నుంచి రూ.3వేలను మహబూబాబాద్ కలెక్టరేట్ లో సీఎంను కలిసి అందజేశారు. ఇదిలా ఉండగా.. కొంతమంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు వరద సహాయక చర్యలకు తమ ఒక రోజు మూల వేతనం రూ. 130 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కు రూపంలో అందజేశారు.