calender_icon.png 25 October, 2024 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత

25-10-2024 04:07:22 PM

హైదరాబాద్: ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... శుక్రవారం పోలీసు కానిస్టేబుల్ భార్యలు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అది అమలు అయ్యేవరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలన్నారు. రిక్రూట్‌మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారని... బెటాలియన్ల ఉద్యోగాలు చేయడం వల్ల తమవారు కుటుంబాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  కాగా సచివాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.